by సూర్య | Wed, Mar 25, 2020, 03:21 PM
అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ లెవిట్ కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలు భయపడాల్సిన పనిలేదని అన్నారు. అందరు అంచనా వేస్తున్నదానికంటే ముందుగానే ఈ మహమ్మారి తోక ముడుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 78 దేశాల్లో కొవిడ్-19 వ్యాప్తి, మరణాల రేటుపై అధ్యయనం అనంతరమే తాను ఈ విషయం చెబుతున్నానని, చైనాలో కొవిడ్-19 వ్యాప్తికి బ్రేక్ పడిన విషయాన్ని మనం మర్చిపోకూడదని, త్వరలోనే పరిస్థితులు చక్కపడుతాయని అన్నారు.
Latest News