ప్రియుడితో వివాహిత జల్సాలు..

by సూర్య | Tue, Mar 24, 2020, 02:19 PM

అక్రమ సంబంధం మరో కుటుంబంలో చిచ్చు రేపింది. భర్త కళ్లుగప్పి ఎన్నాళ్ల నుంచే ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న భార్య బండారం ఆదివారం జనతా కర్ఫ్యూ కారణంగా బట్టబయలైంది. ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్న భర్త కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఆ రోజు భార్య సెల్‌ఫోన్లో గేమ్ ఆడుతూ ఆమె వాట్సాప్‌ చెక్ చేయగా షాకింగ్ విషయాలు తెలిశాయి.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలోని నవాబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన శివ చంద్ర ఠాకూర్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య రాధాదేవి పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. దీంతో శివ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి భార్య, పిల్లలతో సరదాగా గడిపి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే రాధాదేవి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డు కూడా లేకపోవడంతో రోజూ పిల్లలను స్కూల్‌కి పంపి ప్రియుడిని ఇంటికే రప్పించుకునేది.


రోజూ వారిద్దరు వాట్సాప్‌లో ప్రేమ ఊసులు చెప్పుకునేవారు. భర్త ఇంటికి వచ్చే సమయానికి ఆ ఛాటింగ్ అంతా డిలీట్ చేసేసేది. దీంతో ఎప్పటికప్పుడు తన సంబంధం బయటపడకుండా ఆమె జాగ్రత్త పడేది. అయితే ఇటీవల ప్రియుడితో చేసిన ఛాటింగ్ డిలీట్ చేయడం మరిచిపోయింది. ఆదివారం ఇంటికి వచ్చిన భర్త దాన్ని చూడటంతో ఆమె బండారం బయటపడింది. ఇదేంటని నిలదీయగా తన ఇష్టమని రాధాదేవి ఎదురు తిరిగింది. దీంతో శివ వెంటనే డయల్ 112కి ఫోన్ చేశాడు. దీంతో కాసేపటికే పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో భార్యపై భర్త చేయిచేసుకున్నాడు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ దంపతుల మధ్య వివాదం ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు వారిద్దరిని కౌన్సెలింగ్ సెంటర్‌కు తరలించారు

Latest News

 
ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో విడుదల చేసిన టీడీపీ Tue, May 21, 2024, 10:34 PM
మదనపల్లెలో పురుగుమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య Tue, May 21, 2024, 09:35 PM
మదనపల్లెలో మహిళ అరెస్ట్ Tue, May 21, 2024, 09:33 PM
కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా Tue, May 21, 2024, 09:30 PM
చీరాలపై ఎస్పీ జిందాల్ డేగ కన్ను Tue, May 21, 2024, 09:28 PM