by సూర్య | Tue, Mar 24, 2020, 08:11 AM
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ భారత్లో ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా వైరస్ వ్యాప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు, కార్మికులు, సిబ్బంది, భాగస్వాముల శ్రేయస్సు, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కియా మోటార్స్ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది పేర్కొంది. ఏపీలోని అనంతపురంలో ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, కంపెనీ కార్యాలయాన్ని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేయనున్నట్టు తెలిపింది. కరోనా ఎఫెక్ట్ ఇప్పుడే ఏ రంగాన్ని కూడా వదలడం లేదు... అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడంతో.. ఎవ్వరూ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. కియా కూడా ఉత్పత్తిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
Latest News