by సూర్య | Mon, Mar 23, 2020, 05:40 PM
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. సరకు రవాణా విమానాలకు మినహాయింపు ఇచ్చింది. తమ విమానాలన్నీ మంగళవారం అర్ధరాత్రి 11.59గంటల్లోగా గమ్యస్థానాలకు చేరుకునేలా పౌర విమానయాన సంస్థలు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమాన సర్వీసుల్ని నిలిపివేయనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులను వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 415కి పెరగడంతో పాటు 8 మంది మరణించిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Latest News