by సూర్య | Thu, Mar 19, 2020, 01:54 PM
విద్యాసంస్థలు నుండి ఏపికి తిరుగు ప్రయాణం అవుతున్న విద్యార్థులకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం హైలెవల్ టాస్క్ ఫోర్స్ ను నియమించింది. ప్రపంచ మహమ్మారి కరోనా భారీ నుంచి ఏపీని కాపాడేందుకు ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గురువారం సచివాలయంలో రాష్ట్ర మంత్రులతో హైలెవల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని తెలిపారు . ఐఏఎస్ అధికారి జే వెంకట మురళిని కోఆర్డినేటర్ గా నియమించిన ప్రభుత్వం విదేశాంగ శాఖ సమన్వయం చేయనున్న ఏపి ప్రత్యేక ప్రతినిధి విజయ సాయి రెడ్డి టాస్క్ ఫోర్స్ సభ్యులుగా మంత్రి ఆళ్ళ నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల, మేడపాటి వెంకట్ లు వ్యవహరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Latest News