ట్రక్కు, వ్యాను ఢీకొనడంతో మంటలు

by సూర్య | Mon, Feb 17, 2020, 09:45 AM

ఉత్తరప్రదేశ్‌ : ఉన్నావ్‌లో ట్రక్కు, వ్యాను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన బాంగర్మవూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, మారుతి వ్యాను ఢీకొన్నాయి. వెంటనే వ్యాన్ అంతటా మంటలు వ్యాపించాయి. దీంతో వ్యానులో ఉన్నవారు బయటపడలేక సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు.


 


 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM