by సూర్య | Mon, Feb 17, 2020, 09:45 AM
ఉత్తరప్రదేశ్ : ఉన్నావ్లో ట్రక్కు, వ్యాను ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన బాంగర్మవూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వే టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, మారుతి వ్యాను ఢీకొన్నాయి. వెంటనే వ్యాన్ అంతటా మంటలు వ్యాపించాయి. దీంతో వ్యానులో ఉన్నవారు బయటపడలేక సజీవ దహనమయ్యారు. సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు.
Latest News