సెమీస్‌లో పేస్‌ జోడీ

by సూర్య | Fri, Feb 14, 2020, 06:17 PM

భారత దిగ్గజ డబుల్స్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ మాథ్యూ అబ్డెన్‌తో కలిసి పేస్.. ఆండ్రీ గొరన్సన్‌ (స్వీడన్‌)- క్రిస్టోఫర్‌ (ఇండోనేషియా) జోడీపై 7-5, 0-6, 10-7తో విజయం సాధించాడు. పేస్‌ జంటతో పాటు మరికొందరు భారత ఆటగాళ్లు కూడా మెరిశారు. పురవ్‌ రాజా (భారత్‌)- రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ, సాకేత్‌ మైనేని (భారత్‌)- మ్యాట్‌ రీడ్‌ (ఆసీస్‌) జంట కూడా సెమీస్‌కు చేరారు. టాప్‌ సీడ్‌ చెంగ్‌ పెంచ్‌ (చైనీస్‌ తైపీ)- డెనీస్‌ (ఉక్రెయిన్‌) ద్వయంపై సాకేత్‌ జోడీ 3-6, 6-4, 10-8తో గెలిచింది. ఫ్రెడెరికో సిల్వా (పోర్చుగల్‌)- నికోల మిలోజెవిక్‌ (సెర్బియా) జోడీపై పురవ్‌ రాజా - రామ్‌కుమార్‌ రామనాథన్‌ జంట 6-4, 6-4తో విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ గునేశ్వరన్‌ 6-7 (5/7), 0-6తో బెంజిమన్‌ బొంజి (ఫ్రాన్స్‌) చేతిలో, సుమిత్‌ నాగల్‌ 3-6, 3-6తో బ్లజ్‌ రొలా (స్లోవేనియా) చేతిలో ఓడారు. వీరితో పాటు రామ్‌కుమార్‌‌, సాకేత్‌ మైనేవి, నికి పూనచ, సిద్ధార్థ్ రావత్‌ కూడా సింగిల్స్‌లో ఓటమి పాలయ్యారు.

Latest News

 
బాబుతోనే రాష్ట్ర అభివృద్ధి Mon, Apr 29, 2024, 01:20 PM
చంద్రబాబు పర్యటనలో మార్పు Mon, Apr 29, 2024, 01:18 PM
వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ నరసింహారావు Mon, Apr 29, 2024, 01:14 PM
14 మందిపై కేసు నమోదు Mon, Apr 29, 2024, 01:12 PM
మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ను చేసుకుందాం Mon, Apr 29, 2024, 01:10 PM