by సూర్య | Fri, Feb 14, 2020, 03:32 PM
నెల్లూరు జిల్లా : తడ మండలం పన్నంగాడు జాతీయ రహదారి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు డీ కొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారు..అనసూర్య.(27).విజయలక్ష్మి (37).లియాన్ షరీన్(ఏడాది).మరో మహిళ కూడా ఇప్పుడే గుమ్మిడిపూడి ఆసుపత్రిలో చనిపోయింది. వీరంతా ఒంగోలు లాయర్ పేట కు చెందిన వారని సమాచారం. కారు డ్రైవర్ మరియు యజమాని యశ్వంత్ మరో పాప పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
Latest News