కేజ్రీవాల్ ఘన విజయంపై మూడు ముక్కల్లో స్పందించిన నితీశ్ కుమార్

by సూర్య | Tue, Feb 11, 2020, 06:50 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 70 సీట్లున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 60 సీట్లను ఆప్ కైవసం చేసుకోబోతోంది. మిగిలిన 10 స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ కు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. 'జనతా మాలిక్ హై (ఓటర్లే రాజులు)' అంటూ ఆయన మూడు ముక్కల్లో తన స్పందనను తెలియజేశారు. బీజేపీతో ఉన్న పొత్తు నేపథ్యంలో, ఢిల్లీలో రెండు స్థానాల్లో నితీశ్ కు చెందిన జేడీయూ పోటీ చేసింది. మూడు స్థానాల్లో నితీశ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. అమిత్ షాతో కలసి చేసిన ప్రచారంలో నితీశ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలే గుప్పించారు. కేజ్రీవాల్ కేవలం ఉచితంగా ఇచ్చే వాటిపైనే మాట్లాడుతున్నారని... వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM