by సూర్య | Mon, Jan 13, 2020, 07:54 PM
రాజధాని ప్రాంత మహిళలతో పోలీసుల అనుచిత ప్రవర్తనపై ఏపీ హైకోర్టు అగ్రహాం వ్యక్తం చేసింది. రాజధాని రైతుల ఆందోళనలపై మీడియాలో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. రాజధాని గ్రామాల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించడంపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. అమరావతిలో కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపుపై హైకోర్టులో 9 పిటిషన్లు దాఖలు అయ్యాయి. మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఏజీని కోర్టు ప్రశ్నించింది. శుక్రవారంలోగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలని విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Latest News