పేదరికంపై ప‌రిశోధ‌న‌లు చేసిన ముగ్గురికి నోబెల్‌

by సూర్య | Mon, Oct 14, 2019, 10:58 PM

పేదరికం మానవాళికి శాపం కాకూడదనే లక్ష్యంతో, దాన్ని ఎదుర్కోవడంపై అర్థ శాస్త్రంలో  చేసిన పరిశోధనలు చేపట్టిన   మైఖెల్ క్రెమెర్, అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో శాస్త్ర‌వేత్త‌లకు  ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ప్రపంచ మానవాళికి శాపంగా మారుతున్న పేదరికంపై కెన్యాలో పోరాటాన్ని వీరు  ప్రారంభించారు. తొమ్మిదో దశకంలో మైఖెల్ క్రెమెర్ తన ఇద్దరు సహచరులైన అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లోలతో కలిసి కెన్యాలో క్షేత్ర స్థాయిలో తమ ఆర్థిక నమూనాను అమలు చేశారు. ఇవి గొప్ప సత్ఫలితాలనిచ్చాయి. పేదరికంతో బాధపడుతున్నప్పటికీ కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయని చెప్పారు. పిల్లల ఆరోగ్యం, విద్య, తదితర మౌలికాంశాలను అభివృద్ధి చేసుకుంటే వారి కుటుంబాల్లో వెలుగులు ప్రసరిస్తాయి. కెన్యాలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కొన్ని కుటుంబాల్లో వీటిపై అవగాహన కల్పించారు. దీంతో ఆ కుటుంబాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. దీంతో ఈ నమూనాను మరికొన్ని ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ అభిజిత్ బెనర్జీ నేతృత్వంలో ఈ ఆర్థిక నమూనా అమలు చేశారు. దీనివల్ల దాదాపు 50 లక్షల మంది చిన్నారులు బడి బాటపట్టారు. దీంతో పాటు పేదరికంలో మగ్గుతున్న వర్గాలకు సబ్సిడీలు ఇప్పించడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడంతో వారి జీవితాల్లో కొంత మెరుగుదల కనిపించింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తే కొన్ని కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడగలరని క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి.

Latest News

 
బాబు తోనే అభివృద్ధి, సంక్షేమం.. గొండు శంకర్ Tue, Apr 30, 2024, 12:51 PM
వాల్మీకి విగ్రహానికి వైసీపీ నేతలు నివాళి Tue, Apr 30, 2024, 12:39 PM
గజ వాహనంపై ముక్తిరామలింగేశ్వరుడు Tue, Apr 30, 2024, 10:50 AM
వైసిపి మద్దతుదారునపై కత్తులతో దాడి Tue, Apr 30, 2024, 10:28 AM
ఎన్డిఏ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి Tue, Apr 30, 2024, 10:18 AM