టమాటా మార్కెట్‌లో మాయాజాలం..ఉదయం రూ.12 సాయంత్రం 3.. !

by సూర్య | Mon, Oct 14, 2019, 04:48 PM

కర్నూలు జిల్లా, పత్తికొండలోని  టమాటా రైతులు రోడ్డెక్కారు. పంట దిగుబడి కొనుగోళ్లలో వ్యాపారులు దోపిడీకి తెర లేపడంతో కడుపుమండి ఆందోళనకు దిగారు. పత్తికొండలోని ఓ ప్రైవేటు స్థలంలో టమాటా దిగుబడులను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 25కిలోల జత గంపలు రూ.600 ధర పలికాయి. సాయంత్రానికి వ్యాపారులు వీటి ధరను రూ.150కి తగ్గించారు. అదేమని రైతులు నిలదీయడంతో కొనుగోళ్లు నిలిపేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు గుత్తి-పత్తికొండ రహదారిపై బైఠాయించారు. పత్తికొండ సీఐ నరే్‌షబాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా శాంతించలేదు. చివరకు ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా పక్కకు లాగేశారు. టమాటా కొనుగోళ్లలో వ్యాపారుల తీరుపై మూడు రోజుల క్రితం కూడా రైతులు రోడ్డెక్కారు. అప్పుడు దాదాపు నాలుగు గంటల పాటు వారు ఆందోళన చేయడంతో పత్తికొండ- ఆదోని రహదారిపై రాకపోకలు స్తంభించాయి. జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తరువాత అధికారులు పట్టించుకోలేదు. వ్యాపారుల దోపిడీ ఆగలేదు. దీంతో రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు.

Latest News

 
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM