పీవీ సింధు కి రామినేని ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారం

by సూర్య | Sun, Oct 13, 2019, 07:02 PM

 ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు  డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారం  అందుకుంది. ఆదివారం హైదార‌బాద్  నెక్లెస్‌రోడ్‌లో ఉన్న‌ జలవిహార్‌లో జ‌రిగిన సంస్ధ 20వ వార్షికోత్సవం సంద‌ర్భంగా   వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి 2019 సంవత్సరానికి గాను డాక్టర్‌ రామినేని పురస్కారాలను ప్రదానం చేశారు. ఈపుర‌స్కారాలు అందుకున్న వారిలో సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాఫకుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌, కూచిపూడి కళాకేంద్రం వ్యవస్థాపకుడు కళారత్న బాల కొండల  ప్రజాకవి గోరెటి వెంకన్న ఉన్నారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలతో పాటు ఛాముండేశ్వరినాథ్‌ తదితరులు హాజరయ్యారు.

Latest News

 
కుప్పంలో పరిస్థితేంటి..? చంద్రబాబు కంచుకోటలో వైసీపీ జెండా ఎగురుతుందా..? Thu, May 02, 2024, 07:22 PM
మరో పది రోజుల్లో ఎన్నికల పోలింగ్.. ఈసీకీ టీడీపీ లేఖ Thu, May 02, 2024, 07:19 PM
8 రోజుల్లోనే వైసీపీని వదిలేసిన రాయుడు.. అసలు కారణం చెప్పేశాడు Thu, May 02, 2024, 07:15 PM
సీఎం సొంత జిల్లాలో.. వైసీపీ ఎమ్మెల్యేపై బావమరిది పోటీ Thu, May 02, 2024, 07:12 PM
వైసీపీ నవరత్నాలకు పోటీగా కే.ఏ. పాల్ దశరత్నాలు Thu, May 02, 2024, 07:08 PM