by సూర్య | Sat, Oct 12, 2019, 12:15 PM
హైదరాబాద్: యూకే, యుఎస్ఏకు చెందిన కొండే నాస్ట్ ట్రావెలర్ ఇటీవల రీడర్స్ ఛాయిస్ అవార్డ్స్ 2019ను ప్రకటించింది. ప్రపంచ అత్యుత్తమ హోటళ్లలో భారతీయ హోటళ్లు స్థానం దక్కిచుకున్నాయి. ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 17 హోటళ్లు ఉత్తమ హోటళ్లుగా ఎంపికయ్యాయి. వీటిలో భారత్కు చెందిన మూడు హోటళ్లకు స్థానం దక్కింది. ఉదయ్పూర్లోని తాజ్ లేక్ ప్యాలెస్కు మూడో స్థానం, జైపూర్లోని రాంబాగ్ ప్యాలెస్కు ఏడో స్థానం, ఆలియా ఫోర్ట్ బిషన్గర్ 11వ స్థానంలో నిలిచింది. కొండే నాస్ట్ ట్రావెలర్ ప్రయాణికుల ఇష్టమైన గమ్యస్థానాలు, హోటల్స్, స్పాస్, ఎయిర్లైన్స్, క్రూయిజ్ లైన్స్ వంటి వాటిపై సర్వే చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు లక్షల మంది రీడర్స్ అభిప్రాయాలను సేకరించి ఫలితాలను ప్రకటించింది.
Latest News