by సూర్య | Sun, Aug 25, 2019, 09:03 PM
పాస్టర్లు, ఇమాం లకు నెల వేతనం కోసం 948.72 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని , ఇది మతమార్పిడిలకు ప్రోత్సహించేలా ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించదమే నంటూ హిందూ జనజాగరణ సమితి భగ్గుమంది. ఆదివారం విశాఖ పట్నం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సమితి నాయకులూ మాట్లాడుతూ ప్రజల ధనాన్ని ఇతర మాట సంస్థలకి ఎల్లా ఇస్తారని నిలదీశారు. తిరుమల బస్ టిక్కెట్ల పై జరూసలేం, హజ్ యాత్రల ప్రచారం దుర్మార్గమని, రవాణాశాఖా మంత్రి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఎం జరిగినా గత ప్రభుత్వాలపై నీడలేసి తప్పించుకొంటున్న ప్రభుత్వ పెద్దలు తక్షణమే మాటలు మార్చే ఫాస్టర్లకు, ఇమాంల కు పారితోషకాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట విదేశాలు రెచ్చగొట్టేలా , భారతీయ ధర్మాలని అపకీర్తిపాలు చేసేవారిని కట్టడి చేయాలిసిన ప్రభుత్వాలే, వారిని ప్రోత్సహిచేలా పారితోషకాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
Latest News