by సూర్య | Sun, Aug 25, 2019, 12:29 PM
అమరావతి: అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు వ్యవహారంపై ఏపీ శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్స్టేషన్లో అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల కుమారుడు శివరామకృష్ణపైనా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
Latest News