రేపు అరుణ్ జైట్లీ అంతిమ సంస్కారాలు

by సూర్య | Sat, Aug 24, 2019, 03:55 PM

బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆసుపత్రి వద్దకు బీజేపీ అగ్రనేతలంతా చేరుకుంటున్నారు. కాసేపట్లో జైట్లీ పార్థివదేహాన్ని కైలాశ్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించనున్నారు. ప్రజలు, అభిమానుల దర్శనార్థం ఆయన నివాసం వద్ద భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రేపు ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తీసుకెళ్తారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి నిగమ్ బోధ్ ఘాట్ కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు, జైట్లీ మరణం నేపథ్యంలో బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

Latest News

 
ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. బస్ టికెట్లపై భారీ డిస్కౌంట్ Fri, May 03, 2024, 09:56 PM
‘తూర్పు’లో గెలిస్తేనే సీఎం పీఠం.. 19 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Fri, May 03, 2024, 09:50 PM
ఆమె గోల పడలేకే భర్త కూడా.. రోజాపై కమెడియన్ పృథ్విరాజ్ ఘాటు వ్యాఖ్యలు Fri, May 03, 2024, 09:38 PM
తిరుమలలో గదులు దొరకడం లేదా? ఇలా చేస్తే రూమ్ గ్యారెంటీ.. టీటీడీ ఈవో Fri, May 03, 2024, 09:35 PM
ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్ Fri, May 03, 2024, 07:47 PM