రాత్రిపూట ఆ వంతెనపై వెళ్ళారా అంతే !

by సూర్య | Wed, Aug 21, 2019, 06:51 PM

గోవా ట్రిప్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కాని గోవా అంటే బీచ్ లు మాత్రమే కాదు.. భయంకరమైన దెయ్యాలు కూడా ఉంటాయి. గోవాలో ఫేమస్ అయిన కేఫ్‌లు, బీచ్‌లు, చర్చిలు, ఫేమస్ దెయ్యాలు ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. దెయ్యాల సీన్లు అంటే సినిమాల్లో మాత్రమే చూస్తాం. కాని గోవాలో కూడా అలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయట. బోరిమ్ వంతెన పై రాత్రిపూట ప్రయాణించేవారికి ఓ మహిళ నదిలోకి దూకినట్లు, వంతెనపై నడుస్తున్నట్లు కనిసిస్తోందట. కొందరైతే వంతెనపై ప్రయాణించే సమయంలో వెనుక ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుందని చెబుతుంటారు. దీని వెనుక అసలు విషయం తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు కాని.. తెలుసుకోలేకపోయారు.
ఒకప్పుడు గోవాలోని డిమెల్లో హౌస్ ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకునేంది. అయితే, ఈ ఇంటిని సొంతం చేసుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు పోటీపడేవారు. వారి గొడవలు చివరికి హత్యకు దారి తీసింది. అన్న చేతిలో హత్యకు గురైన తమ్ముడు ఆ ఇంట్లో ఆత్మలా సంచరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఒక్కోసారి ఆ ఇంట్లో నుంచి భయానకమైన అరుపులు, కేకలు, శబ్దాలు కూడా వినిపిస్తాయని వారు తెలిపారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM