శింగనమలలో టీడీపీ కార్యకర్తల కమిటి సమావేశం
by సూర్య |
Tue, Aug 20, 2019, 08:46 PM
శింగనమల నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రావణి కార్యకర్తల కమిటి సమావేశం నిర్వహించారు. సమావేశనికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలం నరసయ్యనాయుడు రాష్ట్ర ఎస్సీ సెల్ అద్యక్షుడు ఎమ్మెస్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసారు.
తనపై వస్తున్నఆరోపణలపై మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ పై స్పందిస్తూ అనంతపురం జిల్లాకు ఎవరైతే సస్యశ్యామలం చేస్తారో ఆ పార్టీలో చేరుతానని అదే ఏ పార్టీ అయినా పర్వలేదని అది వైసిపినా బిజెపినా అన్నది తనకు కూడా తెలిదన్నారు మొత్తానికి అనంత ప్రజల కష్టాలు తీర్చలన్నారు.
మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు కాదని వైసిపి కార్యకర్తలు చెబుతున్నారని అవి నవరత్నాలు కాదని నవరాళ్ళని ఆరోపించారు.
జిల్లా అధ్యక్షుడు పార్థసారధి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోనే తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 5వ తేదీలోపే ఫెంక్షన్లు అందించే వారిమని కానీ ఈ ప్రభుత్వం వచ్చాకా ఇప్పటి వరకు ఇవ్వలేని దుస్థితి కొనసాగుతోందని ఆయన వివరించారు.
Latest News