టీడీపీ పై నిప్పులు చెరిగిన విష్ణువర్థన్ రెడ్డి!

by సూర్య | Mon, Jun 24, 2019, 07:15 PM

తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీలో చేరితే తమపై విషం కక్కుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక ప్రజలు కోరుకుంటున్న బీజేపీలో ఉండాలని వారు పార్టీలో చేరారని స్పష్టం చేశారు.
ఇకపోతే ఇటీవలే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. అంతేకాదు టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీడీపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విష్ణువర్థన్ రెడ్డి. బీజేపీ ఏనాడు చట్ట సభల నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని ఆయన తెలిపారు. తప్పు అంతా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీలో పెట్టుకుని మీడియాముందు బీజేపీపై పడి ఏడవడం ఎందుకు అంటూ నిలదీశారు విష్ణువర్థన్ రెడ్డి. 


 

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM