రగ్బీ ఆటలో కొత్త రికార్డు క్రియేట్ చేసిన భారత మహిళల జట్టు !

by సూర్య | Mon, Jun 24, 2019, 07:13 PM

రగ్బీ ఆటలో భారత మహిళల జట్టు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అండర్-15 అంతర్జాతీయ రగ్బీ పోటీల్లో తొలిసారి భారత జట్టు విజయం సాధించింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో శనివారం జరిగిన ఆసియా రగ్బీ మహిళల ఛాంపియన్‌షిప్ డివిజన్-1లో 21-19 తేడాతో టాప్ ర్యాంకర్‌ సింగపూర్‌పై మహిళల టీమ్ విజయ బావుటా ఎగరవేసింది. దీంతో ఈ టోర్నీలో కాంస్య పతకం అందుకున్న మహిళల జట్టు.. తొలి అంతర్జాతీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో చైనా విజేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్‌తో తలపడిన చైనా 68-0 స్కోరుతో ఆ జట్టును చిత్తుగా ఓడించింది.

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM