by సూర్య | Mon, Jun 24, 2019, 10:43 AM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నేడు లోక్సభలో మంత్రి హోదాలో తొలిసారిగా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. జమ్ము కాశ్మీర్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్లును అమిత్షా నేడు లోక్సభలో ప్రవేశపెడతారు. గతంలో ఆర్డినెన్స్ జారీ చేసిన స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్డినెన్స్ను గత ఫిబ్రవరి నెలలో మంత్రివర్గం ఆమోదించింది. దీనికి రాష్ట్రపమతి రామ్నాథ్ కోవింగ్ ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం జమ్ము కాశ్మీర్లో సరిహద్దుల్లో నివసించే ప్రజలకు కూడా నియంత్రణాధీన రేఖ వద్ద నివసిస్తున్న వారితో సమానంగా రిజర్వేషన్లు లభిస్తాయి.
Latest News