by సూర్య | Thu, Jun 20, 2019, 09:15 PM
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు వివాదాలలో చిక్కుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తుంటే అందరు సభ్యులు శ్రద్ధగా ఆలకిస్తున్న ప్పటికీ ఆయన మాత్రం తన ఫోన్లో ఛాటంగ్ చేసుకుంటూ తలమునకలు కావటంపై విమర్శలు వినిసిస్తున్నయి. దాదాపు గంటసేపు రాష్ట్రపతి ప్రసంగించగా... రాహుల్ ఫోన్లో బ్రౌజ్ చేస్తూ వీడియోలకు చిక్కారు., అయితే ఆయన పక్కనే ఉన్న సోనియా గాంధీ మాత్రం రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆసక్తిగా వినటం గమనార్హం. ఉరీ, బాలాకోట్ దాడుల గురించి కోవింద్ మాట్లాడుతున్నాప్పుడు సోనియా గాంధీ బల్లని చరుస్తూ ప్రశంసించారు.
Latest News