by సూర్య | Wed, Mar 20, 2019, 10:16 AM
లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్నుంచి అందరూ కొత్తవారినే ఎంపిక చేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 10 మంది సిటింగ్ ఎంపిలను మార్చి, వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయనున్నది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరాజయం చవి చూసిన నేపథ్యంలో బిజెపి ఈ నిర్ణయం తీసుకుంది. బిజెపి ప్రధాన కార్యదర్శి, ఛత్తీస్గఢ్ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జి అనిల్ జైన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కొత్తవారితో, నూతనోత్సాహంతో ఎన్నికల్లో పోటీ చేయనున్నామని అనిల్ జైన్ అన్నారు.
Latest News