దిశ చట్టం పేరుతో జగన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టారు

by సూర్య | Thu, Oct 24, 2024, 09:34 PM

ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ అధినేత జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం తల్లి విజయను, సోదరి షర్మిలను పట్టి పీడిస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దిశ చట్టం పేరుతో జగన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. "విద్యార్హతలు కూడా చెప్పుకోలేని వ్యక్తి జగన్. వైసీపీ పాలనలో తీసుకొచ్చిన దిశా చట్టంపై చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు.


అయితే ఈ సవాల్‌ను స్వీకరించకుండా తాడేపల్లి ఇల్లు దాటి బయటకు రావడానికే జగన్ జంకారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని వ్యక్తి.. నిప్పులాంటి నారా లోకేష్‍‌ని విమర్శిస్తే ఎవరూ సహించరు. విద్యాశాఖ మంత్రిగా ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థి దగ్గర్నుంచి అత్యున్నతమైన బోధన చేసే ఉపాధ్యాయుల మనసును లోకేష్ గెలుచుకున్నారు. తండ్రి పేరును నిలబెట్టే వ్యక్తి నారా లోకేష్ అయితే.. తండ్రి పేరును చెడగొట్టే వ్యక్తిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు" అని మంత్రి మండిపడ్డారు.

Latest News

 
ఈనెల 30న ఒంగోలులో జిల్లాస్థాయి కూటమినేతల సమావేశం Mon, Oct 28, 2024, 10:17 PM
పొత్తు ధర్మం పాటిస్తాం కానీ బాలినేనిని మాత్రం క్షమించం Mon, Oct 28, 2024, 10:16 PM
త్వరలోనే ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ ప్రారంభిస్తాం Mon, Oct 28, 2024, 10:14 PM
వైభవంగా ప్రారంభమైన చెకుముకి సంబరాలు Mon, Oct 28, 2024, 10:14 PM
జిల్లాకే వన్నె తెచ్చిన తప్పెట గుళ్ల ప్రదర్శన Mon, Oct 28, 2024, 10:12 PM