జగన్‌కు షర్మిల రాసిన లేఖ వివరాలను ట్వీట్ చేసిన టీడీపీ

by సూర్య | Wed, Oct 23, 2024, 09:17 PM

ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీటితో ఓ సైకోకు రాసిన లేఖలోని మొదటి భాగం అంటూ తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. అంతకుముందు, "బిగ్ ఎక్స్‌పోజ్, 24 అక్టోబర్ మధ్యాహ్నం 12 గంటలకు" అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కాసేపటి క్రితం రేపు కాదు... ఈరోజే ఆ సంచలనాన్ని వెలుగులోకి తెస్తున్నామని మరో ట్వీట్ చేసింది. ఆ తర్వాత షర్మిల, విజయమ్మ... జగన్‌కు రాసిన లేఖ అంటూ వరుస ట్వీట్లు చేసింది. జగన్‌కు 12 సెప్టెంబర్ 2024న రోజున లేఖ రాసినట్లుగా తేదీ ఉంది.చరిత్రలో ఏ పురాణం చూసినా, ప్రపంచంలోని ఏ జీవిని చూసినా తల్లి తర్వాతేనని, జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుందని, కానీ ఈ కన్నీటి లేఖ (షర్మిల, విజయమ్మ)ను చూస్తే జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఓ వింత సైకో గురించి తెలుసుకుంటారని జగన్‌ను ఉద్దేశించి పేర్కొంది.ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్ అనే సైకో ఎలా వేధిస్తున్నాడో... తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటని ఈ సైకో ఎలా తప్పాడో చెబుతూ... కన్నీళ్ళతో, సైకో జగన్‌కి చెల్లి షర్మిల లేఖ రాశారని, ఆ లేఖపై తల్లి విజయమ్మ సంతకం పెట్టారని పేర్కొంది.ఇలాంటి సైకోలు రాజకీయాల్లో ఉంటే... మన సమాజంలో ఉంటే... ఎంత ప్రమాదమో చెప్పటానికే ఈ లేఖని ప్రజల్లో పెడుతున్నామని పేర్కొంది. ఈ లేఖలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయని, ఏడో అంశం చూస్తే, జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత పిరికివాడో తెలుస్తుందని పేర్కొంది.

Latest News

 
బిగ్ ఎక్స్‌పోజ్ బయటపెట్టిన టీడీపీ.. వైఎస్ షర్మిల రాశారంటూ లేఖ ట్వీట్ Wed, Oct 23, 2024, 11:20 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. రేపే ఆ కోటా టికెట్లు విడుదల Wed, Oct 23, 2024, 11:18 PM
విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా? Wed, Oct 23, 2024, 10:18 PM
షర్మిల, విజయమ్మకు షాకిచ్చిన వైఎస్ జగన్..ఎన్సీఎల్టీలో పిటిషన్, ఆ కంపెనీ షేర్ల కోసం! Wed, Oct 23, 2024, 10:16 PM
జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు.. ఆ ఒక్క కారణంతో వైసీపీకి రాజీనామా చేశా: వాసిరెడ్డి పద్మ Wed, Oct 23, 2024, 10:13 PM