భూ సమస్యలని వెంటనే పరిష్కరించాలి

by సూర్య | Wed, Oct 23, 2024, 08:16 PM

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య చెప్పారు. పగిడ్యాల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం తహసీల్దార్‌ శివరాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఎంపీడీవో సుమిత్రమ్మ, టీడీపీ నాయకుడు సురేంద్రనాథ్‌రెడ్డి, మండల కన్వీనర్‌ మహేశ్వరరెడ్డి, దామోదరరెడ్డి, రాజశేఖరరెడ్డి, వాసురెడ్డి, వెంకట్‌రెడ్డి, లోకానందరెడ్డి, రామిరెడ్డి , ఫరూక్‌బాషా, వెంకటేశ్వర్లు, బాలీశ్వరగౌడ్‌, రమణ పాల్గొన్నారు. పగిడ్యాలలో శిథిలావస్థకు చేరుకున్న తహసీల్దార్‌ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే జయసూర్య అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పీఆర్‌ ఏఈ జావీద్‌ను పిలించి వెంటనే మైనర్‌ రిపేరీలు చేపట్టాలని సూచించారు.

Latest News

 
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి Thu, Oct 24, 2024, 09:46 PM
రాజకీయ లబ్ధి కోసమే ఈ పరామర్శలు Thu, Oct 24, 2024, 09:42 PM
అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌ Thu, Oct 24, 2024, 09:41 PM