శవాల చుట్టూ రాజకీయం చెయ్యడం మానుకోవాలి

by సూర్య | Wed, Oct 23, 2024, 08:13 PM

వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు నెలలకే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ శవం దొరికితే అక్కడకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పిచ్చోడు చేతిలో రాయి ఉన్నట్లు కూటమి ప్రభుత్వంపై విమర్శిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలు, ఆడపిల్లల భద్రత విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. హోంమంత్రి నేరుగా వెళ్లి బాధితులను పరామర్శించి పరిహారం అందిస్తున్నారని తెలిపారు.


‘‘ప్రభుత్వంపై బురద జల్లటం కోసమే మీతో పాటు మీ పార్టీ నేతలు పని చేస్తున్నారు.11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఏం చేస్తున్నారో చెప్పాలి. దేవుడు పై నుంచి చూస్తున్నారని జగన్ అంటారు... భగవంతుడు చూశారు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు’’ అని అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా శవాల చుట్టూ రాజకీయం చేయటం హాస్యాస్పదమన్నారు. జగన్ ఈసారి శవ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు.

Latest News

 
రాప్తాడు: వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేత Fri, Oct 25, 2024, 05:50 PM
11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత Fri, Oct 25, 2024, 05:34 PM
గులాబీ పార్టీలో కీలక పోస్టు ఖాళీ Fri, Oct 25, 2024, 05:32 PM
బెల్ట్ షాపులు లేని మండలంగా నాంపల్లి కావాలని భారీ ర్యాలీ Fri, Oct 25, 2024, 05:30 PM
ఏపీ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం Fri, Oct 25, 2024, 03:56 PM