దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు

by సూర్య | Fri, Jul 26, 2024, 11:54 PM

 వైసీపీ ప్రభుత్వ హయాంలో పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో రూ. కోట్ల విలువైన దేవుడి భూములు అక్రమణకు గురయ్యాయని ఎమ్మెల్యే గౌరుచరిత స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ దృష్టికి ఆమె వైసీపీ నాయకుల భూ ఆక్రమణలను తీసికెళ్లారు. ఈ సందర్భంగా గౌరుచరిత మాట్లాడుతూ మాధవ ఆంజనేయస్వామికి దాదాపు 188 ఎకరాలు భూమి ఉండగా రూ. కోట్ల విలువైన 70 ఎకరాలు వైసీపీ నాయకులు ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. అలాగే ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలోని కాశీ విశ్వేశ్వరస్వామికి చెందిన భూముల్లోని మట్టిని వైసీపీ నాయకులు అమ్ముకుని వ్యాపారం చేశారని తెలిపారు. దీని వల్ల ఆ భూములు ఎందుకూ పనికి రాకుండా పోయాయన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్‌ల నిధులను దోచుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని స్పీకర్‌ ద్వారా మంత్రికి విన్నవించారు. విచారణ చేసి బాద్యులపై చర్యలు తీసుకోవాలని గౌరుచరిత సభను కోరారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM