by సూర్య | Fri, Jul 26, 2024, 12:56 PM
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి డీజీపీ ద్వారకా తిరుమలరావును శుక్రవారం మంగళగిరిలో మర్యాద పూర్వకంగా కలిశారు. అవనిగడ్డలో నాలుగేళ్ళ క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసును డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసును సీబీసీఐడీ ద్వారా విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
Latest News