by సూర్య | Fri, Jul 26, 2024, 10:13 AM
చిత్తూరు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఆగస్ట్ 10వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని డీపీవో లక్ష్మి గురువారం ఆదేశించారు. అన్ని పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తాగునీటిని అందించడం, చెత్త దిబ్బలను తొలగించడం తదితర ఫోటోలను పీఆర్-1 యాప్ లో పొందుపరచాలన్నారు. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని సూచించారు.
Latest News