ప్రైవేటైజేషన్ కాకుండా చూస్తాం

by సూర్య | Thu, Jul 11, 2024, 05:00 PM

 విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటైజేషన్ అవ్వకూడదనే భావన అందరికీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసేందుకు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బ్లాక్‌కు ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలకు భద్రత కల్పించి ఎంతోమంది ప్రాణత్యోగాలు చేసి స్టీల్ ప్లాంట్‌ను తీసుకొచ్చారని గుర్తుచేశారు. విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అవ్వకుండా మంచి భవిష్యత్తు స్టీల్ ప్లాంట్‌కి ఉండేటట్టు చూడవలసిందిగా తాము కూడా కోరామని తెలిపారు. ఎలక్షన్ ముందు కూడా కోరడం జరిగిందన్నారు. ఎలక్షన్ తర్వాత బీజేపీ పార్లమెంట్ సభ్యులు... కేంద్ర అధిష్టానానికి చెప్పామన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్, కేంద్రమంత్రి కుమారస్వామి ప్లాంట్ విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్‌‌కు అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను సేల్‌లో టేక్ ఓవర్ చేయడమా అని ప్రశ్నించారు. ‘‘ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే.. మన భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది అందరి అభిప్రాయం’’ అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

Latest News

 
ఈనెల 30న ఒంగోలులో జిల్లాస్థాయి కూటమినేతల సమావేశం Mon, Oct 28, 2024, 10:17 PM
పొత్తు ధర్మం పాటిస్తాం కానీ బాలినేనిని మాత్రం క్షమించం Mon, Oct 28, 2024, 10:16 PM
త్వరలోనే ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ ప్రారంభిస్తాం Mon, Oct 28, 2024, 10:14 PM
వైభవంగా ప్రారంభమైన చెకుముకి సంబరాలు Mon, Oct 28, 2024, 10:14 PM
జిల్లాకే వన్నె తెచ్చిన తప్పెట గుళ్ల ప్రదర్శన Mon, Oct 28, 2024, 10:12 PM