by సూర్య | Fri, Apr 26, 2024, 06:46 PM
మేకప్ లేనిదే మోదీ బయటకు రారని, ఆయన మేకప్ ఖర్చురోజుకు రూ.20 వేలు అవుతుందని కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ పార్టీలు మోదీ, అమిత్ షా జేబులోకి వెళ్లిపోయాయని విమర్శించారు. రాబోయే పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజలు విజ్ఞతతో, వివేకంతో, ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు అనుకూల గాలి వీస్తోందన్నారు.
Latest News