by సూర్య | Fri, Apr 26, 2024, 03:12 PM
అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయం అంతా గుడివాడ చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు ఈ గడ్డ. టీడీపీ ఆవిర్భావం నుంచి ఏడుసార్లు నెగ్గి అభివృద్ధికి బాటలు వేసి గుడివాడ పేరును రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేసింది. పచ్చని పొలాలు, చెరువు గట్టులతోపాటు శుభకార్యాలకు నెలవులైన కల్యాణమండపాలను సైతం జూదగృహాలుగా మార్చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ, వైసీపీ తలబడుతున్నాయి. ఈసారి అభివృద్ధివైపు నిలబడలా? అరాచకానికి బలవ్వాలా? అనేది ప్రజలు కొద్దిరోజుల్లో నిర్ణయించనున్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపైనా విమర్శలు గుప్పించారు. షర్మిలా ఒక పార్టీ లో ఉన్నారని.. ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నారని అన్నారు. విమర్శలు చేసేటప్పుడు ఆమె సంయమనం పాటించాలని సూచించారు. నిన్నటి వరకు చెల్లి... ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు అని అన్నారు. అలాగే.. జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ సునీత రెడ్డి ఇచ్చిన సలహాపైనా మంత్రి స్పందించారు. తలకి పెట్టుకున్న బ్యాండేజీ తీసుకోవాలా లేదా అనేది జగన్ దగ్గర ఉన్న డాక్టర్లు చూసుకుంటారన్నారు. ఆమె దూరం నుంచి సలహా ఇస్తున్నారంటూ సునీతపై విరుచుకుపడ్డారు. ‘‘ఫోన్లో కన్సల్టెన్సీకి , చెయ్యి పట్టుకొని వైద్యం చేసే డాక్టర్లకు తేడా లేదా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు.
Latest News