పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు?

by సూర్య | Fri, Apr 26, 2024, 02:15 PM

పియుష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారు. 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా(చంద్రబాబును ఉద్దేశిస్తూ..) ఉన్నారు. అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారు. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు?. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అడ్డంకులు అన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించాం అని మంత్రి బొత్స గుర్తుచేశారు.  2014-19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమా?.. మధ్యలో ఒక ఇంజిన్‌ పని చేసిందా? మరో ఇంజిన్‌ రిపేర్‌ అయ్యిందా? అని మంత్రి బొత్స ఎద్దేశా చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఎలక్టోరల్ బాండ్స్ లో అతి పెద్ద అవినీతి జరిగింది బీజేపీ హయాంలోనే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ పని చేస్తుంది. మేలు జరిగే ప్రతీ అంశానికి మద్దతు ఇస్తాం. ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికగా జరిగే కేటాయింపు. దళితుల రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే బీజేపీ మట్టి కొట్టుకుపోతుంది. మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలి. పియుష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని ఆయన్ని కోరుతున్నా అని మంత్రి బొత్స అన్నారు. 

Latest News

 
ధర్మవరంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం Wed, May 08, 2024, 03:33 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ కు ఓటు వేయండి Wed, May 08, 2024, 03:31 PM
బెళుగుప్ప గ్రామ టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయిన అంబికా Wed, May 08, 2024, 03:10 PM
రోగులను పరామర్శించిన అంబికా లక్ష్మి నారాయణ Wed, May 08, 2024, 03:08 PM
అభివృద్ధి చేసి చూపించిన ఘనత టీడీపీ ది: ఎంపీ అభ్యర్థి బి. కె. Wed, May 08, 2024, 03:06 PM