విజయవాడ దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. వారికి ఉచిత దర్శనం

by సూర్య | Sun, Apr 14, 2024, 09:24 PM

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు ఎక్కడినుంచో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఇంద్రకీలాద్రి కిటకిటలాడిపోతుంది. అయితే దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. అమ్మవారి దర్శనం ఇకపై వారికి ఉచితంగా లభించనుంది. అది కూడా అంతరాలయ దర్శనం. ఈ విషయాన్ని దుర్గామల్లేశ్వరిస్వామి వార్ల దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు . మే నెల ప్రారంభం నుంచి నూతన వధూవరులకు అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం, లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు.


అయితే ఈ సదుపాయాన్ని పొందేందుకు కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రమే అర్హులు. వివాహ దుస్తుల్లోనే ఆలయాన్ని సందర్శించాలి. కొత్త జంటతో పాటు వారి కుటుంబసభ్యులకు ఉచితంగా వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే సౌభాగ్యమస్తు పథకం కింద కొత్తగా పెళ్లైనవారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి నెలలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని అమల్లోకి తేవాలని ఇప్పటికే అనేకసార్లు ప్రతిపాదనలు వచ్చాయని.. అయితే అమల్లోకి రాలేదని ఆలయ వర్గాలు తెలిపాయి. తాజాగా మే నెల ప్రారంభం నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు.


మరోవైపు తిరుమలలోనూ ఇలాంటి విధానమే ఉంది. కళ్యాణోత్సవ సేవ కింద నూతన వధూవరులకు టీటీడీ ఇలాంటి సౌకర్యం కల్పిస్తోంది. అయితే అందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇంద్రకీలాద్రిలో మాత్రం దీనిని ఉచితంగా అమలు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే దంపతులు ఆలయాన్ని సందర్శించినప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఆలయ అధికారులు కొత్త జంటతో పాటుగా వారి కుటుంబానికి ఉచితంగా దర్శనం కల్పిస్తారని చెప్తున్నారు. అలాగే వివాహ విశిష్టతను తెలియజేసే ఓ పుస్తకాన్ని కూడా వధూవరులకు అందించనున్నారు. అలాగే దుర్గమ్మ సన్నిధిలో పెళ్లి చేసుకునే జంటల కోసం శాశ్వత కళ్యాణ వేదికను సైతం నిర్మించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.


Latest News

 
స్టెప్ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు Fri, Sep 20, 2024, 10:18 AM
నక్కపల్లిలో 9వ రోజు జనవాణి కార్యక్రమం Thu, Sep 19, 2024, 07:55 PM
టెక్కలిలో కాంగ్రెస్ నాయకులు నిరసన Thu, Sep 19, 2024, 07:40 PM
మాజీ సైనికులకు కార్పొరేషన్ ప్రకటనపై హర్షం: కేంద్రమంత్రి Thu, Sep 19, 2024, 07:34 PM
అగ్ని ప్రమాదంలో ఆహూతైన పూరీ గుడిసెలు Thu, Sep 19, 2024, 07:33 PM