by సూర్య | Fri, Apr 12, 2024, 04:44 PM
ధర్మవరం పట్టణంలోని 14వ వార్డు, 31వ వార్డుల నుండి వివిధ పార్టీలకు చెందిన 300 మందికి పైగా ప్రజలు శుక్రవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వారందరినీ సాధరంగా పార్టీలోకి ఆహ్వానించి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు మీ ముందుకు తెస్తానని హామీ ఇచ్చారు.
Latest News