రఘురామకే ఉండి సీటు

by సూర్య | Fri, Apr 12, 2024, 03:32 PM

ఉండి కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అనంతరం అయన చేసిన కామెంట్స్‌ను బట్టి చూస్తే ఉండి అసెంబ్లీ టికెట్‌ను రఘురామకృష్ణం రాజుకే కేటాయిస్తారని క్లారిటీ వస్తోంది. ఇటీవల రఘురామ సైతం ఉండి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఊతమిచ్చినట్లుగా.. చంద్రబాబు కూడా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు. అయితే, రామరాజుకు కాకుండా.. రఘురామకు టికెట్ కేటాయించడాన్ని ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. రామరాజుకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్ంయలోనే వీరిని శాంతింపజేసేందుకు చంద్రబాబు నేరుగా కలిశారు. వారికి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఒకటి రెండు రోజుల్లో రఘురామ కృష్ణం రాజు పేరును ఉండి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ ప్రకటన వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాలి.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM