by సూర్య | Fri, Apr 12, 2024, 02:55 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు ధూళిపాళ్ల రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ప్రజలు సీఎం వైయస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. ఉప్పొంగుతున్న అభిమానంతో జననేతకు గజమాలతో, పూలవర్షంతో స్వాగతం పలికారు. సంక్షేమ పాలన అందించిన ప్రజానాయకుడికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. నేడు బస్సు యాత్ర సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా కొనసాగనుంది. హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, VIP రోడ్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్,పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి సీఎం వైయస్ జగన్ చేరుకుంటారు.
Latest News