by సూర్య | Fri, Apr 12, 2024, 02:51 PM
పౌరుల గుమ్మం వద్దకే సంక్షేమ ఫలాలను తీసుకుని వచ్చాం అని, మీ ఇంటి వాకిటే అభివృద్ధి అన్నది కనిపిస్తూ ఉందని, ఇవాళ గ్రామాల రూపు రేఖలు మార్చేందుకు, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలలో అనూహ్య మార్పులు తీసుకుని వచ్చి వాటిని క్షేత్ర స్థాయిలో చేర్చేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, పాలన సంబంధం అయిన సంస్కరణలన్నవి ఇప్పుడిప్పు డే సత్ ఫలితాలు ఇస్తున్నాయని..వీటిని మీరు అర్థం చేసుకుని, రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారం ఇవ్వాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో కసిమివలస,గేదెలవానిపేట గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకత్వంతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్య దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు మీరు ఇచ్చిన అధికారం కారణంగానే మేం ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేపట్టగలిగాం. మళ్లీ ఈ సారి వైయస్ఆర్ సీపీ తరఫునే శాసన సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వండి అని కోరారు.
Latest News