by సూర్య | Mon, Mar 20, 2023, 10:28 AM
కొమరాడ మండలం దుగ్గి పరిసర ప్రాంతంలో ఎనిమిది ఏనుగులు గుంపు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. గుంపు నుండి విడిపోయిన మరొక ఏనుగు గత వారం రోజులుగా గుణనుపురంలో సంచరిస్తూ ఈ రోజు సోమవారం ఉదయం గుంపులోకి చేరుకుంది. దాంతో మొత్తం ఎనిమిది ఏనుగులు దుగ్గి పరిసరాల్లో సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు. కనుక సమీప ప్రాంతాల ప్రజలు ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎవరు ఏనుగుల వద్దకు వెళ్లవద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు.
Latest News