by సూర్య | Sat, Jan 28, 2023, 11:32 AM
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేడు రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథసప్తమి శనివారం పడటం వల్ల ఆలయ అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. వేకువ జామునే భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు భక్తులకు అందజేశారు.
Latest News