by సూర్య | Sat, Jan 28, 2023, 11:05 AM
ఇజ్రాయిల్ లో విషాదం చోటుచేసుకుంది. జెరూసలేం ప్రార్థనా మందిరంలో ఓ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. షబ్బత్ ప్రార్థనల్లో పాల్గొనే ఇజ్రాయిలే లక్ష్యంగా పాలస్తీనా తీవ్రవాది కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత సదరు ఉగ్రవాది పారిపోవడానికి యత్నించగా, పోలీసులు అతడ్ని కాల్చిచంపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
Latest News