పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:06 AM

తిరువూరు,  వార్డుల పరిధిలోని నూతన ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, తొలగించిన ఓట్లపై దృష్టి సారించాలని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ సూచించారు. టీడీపీ కార్యాలయంలో బూత్‌ కన్వీనర్లు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. పాత, కొత్త జాబితాలను పరిశీలిస్తూ తొలగించిన ఓట్లను ఎందుకు తొలగించారో గుర్తించాలన్నారు. అర్హతగల యువతి యువకులతో నూతన ఓటు నమోదుకు సంబంధించిన ధరఖాస్తులు అందించాలని, బూత్‌స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. వెదురు వెంకటనర్సిరెడ్డి, గద్దె వెంకటేశ్వరరావు, దొడ్డా లక్ష్మణరావు, బొంతు మాధవరావు, గద్దె హరిబాబు, బుడ్డి జగన్‌, బొద్దుకోళ్ళ ప్రేమరాజు, తెలప్రోలు మోహన్‌రావు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM