పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:06 AM

తిరువూరు,  వార్డుల పరిధిలోని నూతన ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, తొలగించిన ఓట్లపై దృష్టి సారించాలని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ సూచించారు. టీడీపీ కార్యాలయంలో బూత్‌ కన్వీనర్లు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. పాత, కొత్త జాబితాలను పరిశీలిస్తూ తొలగించిన ఓట్లను ఎందుకు తొలగించారో గుర్తించాలన్నారు. అర్హతగల యువతి యువకులతో నూతన ఓటు నమోదుకు సంబంధించిన ధరఖాస్తులు అందించాలని, బూత్‌స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. వెదురు వెంకటనర్సిరెడ్డి, గద్దె వెంకటేశ్వరరావు, దొడ్డా లక్ష్మణరావు, బొంతు మాధవరావు, గద్దె హరిబాబు, బుడ్డి జగన్‌, బొద్దుకోళ్ళ ప్రేమరాజు, తెలప్రోలు మోహన్‌రావు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM