సోషల్ మీడియా స్నేహంపై అప్రమత్తంగా ఉండాలి..లేకపోతే ఇలాంటి ఘనలే

by సూర్య | Wed, Oct 05, 2022, 01:14 PM

సోషల్ మీడియా వచ్చాక ముక్కు..మోహం తెలియని వారు సైతం స్నేహితులవుతున్నారు. అయితే సోషల్ మీడియా స్నేహాలు ఎంత చేటు చేస్తాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన మహిళను తన ఆసుపత్రికి రమ్మని ఆహ్వానించిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ ఆసుపత్రి వైద్యుడికి సోషల్ మీడియా ద్వారా ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళతో పరిచయమైంది. ఆ తర్వాత స్నేహం పెద్దదైంది. 


ఈ క్రమంలో ఒకసారి తన ఆసుపత్రిని సందర్శించాలని బాధిత మహిళను వైద్యుడు కోరారు. సరేనన్న ఆమె అతడిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను తన హాస్టల్ గదిలోకి తీసుకెళ్లిన వైద్యుడు.. అక్కడ తన సహచరులైన వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 27న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

Latest News

 
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు Fri, May 17, 2024, 09:17 PM
విశాఖ వందేభారత్ ఐదు గంటలు ఆలస్యం.. ఈ రైళ్లు బయల్దేరే సమయం మారింది Fri, May 17, 2024, 09:13 PM
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..ఈ రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు Fri, May 17, 2024, 09:09 PM
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ Fri, May 17, 2024, 09:05 PM
రాడ్ తీయించుకునేందుకని ఆస్పత్రికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు Fri, May 17, 2024, 09:01 PM