రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

by సూర్య | Tue, Oct 04, 2022, 02:05 PM

విశాఖ కేంద్ర కారాగారం ఎదురుగా బిఆర్ టిఎస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.


ఇటీవల కాలంలో ఇదే మార్గంలో ప్రమాదాలు జరిగి పలువురి ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో సీపీ శ్రీకాంత్, ట్రాఫిక్ ఏడిసిపి ఆరిఫుల్లా ఆయా ప్రాంతాలను సందర్శించి వాహన రాకపోకలపై పలు ఆంక్షలను విధించారు. అయినప్పటికీ మంగళవారం ఈ ప్రమాదం జరగడం దురదృష్టంగా పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ ఏడిసిపి ఆరిఫుల్లా ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను కేజీహెచ్ మార్చురికి తరలించారు.

Latest News

 
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM