by సూర్య | Fri, Sep 23, 2022, 01:07 PM
ఒక అరటి పండు గుజ్జును, 6 చుక్కల బాదం నూనె కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. షవర్ కవర్ వేసుకొని అరగంట ఆరనివ్వాలి. జుట్టులోకి బాగా ఇంకిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మాడుపైన కణాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చుండ్రు, దురద పోతాయి. జుట్టు చివర్ల ఏర్పడే పగుళ్లు తగ్గి, మృదువుగా మారతాయి. ఈ ప్యాక్ కండిషనర్ లా పనిచేసి, జుట్టు మెరిసేలా చేస్తుంది.
Latest News