by సూర్య | Thu, Sep 22, 2022, 11:46 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అతని భార్య షబానాను సీబీఐ అధికారులు గురువారం పిలిపించి ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారాడు. వివేకా హత్యపై ఇతను చెప్పిన వివరాలే సీబీఐ అధికారుల విచారణలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో దస్తగిరిని సీబీఐ అధికారులు మరోమారు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Latest News