తెనాలి పోలీసులపై చర్యలు

by సూర్య | Fri, Apr 26, 2024, 06:43 PM

ఏపీ ఎన్నికల ముందు ఏపీ పోలీసులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాపట్ల జిల్లా పోలీసులపై తెనాలి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా పోలీసులకు తెనాలి కోర్టు శుక్రవారం నాడు సమన్లు జారీ చేసింది. చుండూరు మండలం చుండూరు గ్రామానికి చెందిన గుదేటి బాలకోటిరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసింది. తెలుగు యువత నాయకుడు బాలకోటిరెడ్డిని 2023 జూలై 2వ తేదీన పోలీసులు నిర్బంధించారు. చుండూరు సీఐ, అమర్తలూరు ఎస్సై, చుండూరు ఎస్సై, భట్టిప్రోలు ఎస్సై, నగరం ఎస్సై కలిసి అక్రమంగా తనను నిర్బంధించినట్లు బాలకోటిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెనాలి రెండో అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్టేట్ ముందు బాలకోటిరెడ్టి వాగ్మూలం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా దాడి నిజమని తేలడంతో తెనాలి కోర్టు ఈ చర్యలు చేపట్టింది. పోలీస్ అధికారులపై కోర్టులో బాలకోటిరెడ్టి ఫిర్యాదు దాఖలు చేశారు. ఆధారాలు పరిశీలించిన తర్వాత పోలీసులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Latest News

 
అవినాష్‌ గెలిస్తే నేరం గెలిచినట్లే: షర్మిల Wed, May 08, 2024, 11:40 AM
విద్యుత్ షాక్ తో రైతు గొల్ల మనోహర్ మృతి Wed, May 08, 2024, 11:33 AM
నేటి పంచాంగం 08-05-2024 Wed, May 08, 2024, 10:43 AM
జగన్ను గెలిపించండి: లక్ష్మీ భార్గవి Wed, May 08, 2024, 10:39 AM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 10:39 AM