by సూర్య | Fri, Apr 26, 2024, 06:42 PM
‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్త పర్యటన చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దళితులని చిన్న చూపు చూసింది అనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీటిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ..... ‘‘సొంత చెల్లి కట్టుకున్న చీరపైనే కామెంట్ చేసిన సీఎం వైయస్ జగన్... నా తల్లిని వదులుతాడా? ఇంకెంత కాలం ఈ ఫేక్ ఎడిట్స్తో బ్రతుకుతావు జగన్?’’ అంటూ నారా లోకేశ్ సూటిగా ప్రశ్నించారు. కాగా దళితులను దూషించినట్లు నారా భువనేశ్వరి వాయిస్తో ఓ ఆడియో అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Latest News